Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ నిందితులను కస్టడీ ఇవ్వాలని పిటిషన్

0 12

ఫోన్ ట్యాపింగ్ నిందితులను కస్టడీ ఇవ్వాలని పిటిషన్
– కేసును రేపటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

నిర్దేశం, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరగా, బుధవారంలోగా పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ఈకేసును బుధవారానికి వాయిదా వేసింది.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ప్రణీత్ రావు, ఏ-2గా భుజంగ రావు, ఏ-3గా తిరుపతన్న ఉన్నారని, వీరి ముగ్గురిని కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు కస్టడీ ఇప్పటికే ముగిసింది. అయితే భుజంగ రావు, తిరుపతన్నతో పాటు ప్రణీత్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తవ్వేకొద్ది నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయం ఒకటి బయటికొచ్చింది.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగానే అక్రమ ఆస్తులు కూడా బెట్టుకున్నారని తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ (ACB).. ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాలను బెదిరించి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా తేలినట్లు సమాచారం. ఈ డబ్బుతో భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలిందట. అంతేకాదు.. విలాసవంతమైన విల్లాల్లో ఆ అధికారులు నివాసం ఉంటున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏసీబీ చేతికి వెళ్లింది. ఈ కేసులో నిందితులు ఆదాయానికికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఏసీబీ అనుమానిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking