Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రజలారా బీజేపీతో జాగ్రత్త : బిఎస్ పి

0 79

జంగు సైరన్ మోగించాలని విద్యుత్ ఉద్యోగులకు సూచన

మన రాజ్యం వస్తేనే మన బతుకులు మారుతాయి

  • బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 16 (వైడ్ న్యూస్) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతీక్ అహ్మద్ హత్య అత్యంత దారుణమని,పో లీసుల సమక్షంలోనే హత్య జరగడం దురదృష్టకరం అన్నారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు అత్యంత దారుణంగా క్షీణించాయన్నారు. తెలంగాణ ప్రజాలంతా బిజెపి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు ఆయన. బీజేపీ  తెలంగాణలో గెలిస్తే అలాంటి పరిస్థితులే వస్తాయని హెచ్చరించారు ప్రవీణ్ కుమార్.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని విమర్శించారు ప్రవీణ్ కుమార్. విద్యుత్ ఉద్యోగులు తమకు 30 శాతం పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఉద్యోగులను బెదిరించి, భయపెట్టి కేవలం 7 శాతానికి మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు.

ఆర్టిజన్ ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగుల వలే అన్ని సౌకర్యాలు అందించకుండా, రెండవ శ్రేణి ఉద్యోగుల వలే, చిన్న చూపు చూస్తూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. మన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు, ఉద్యోగులు జంగు సైరన్ మోగించాలని పిలుపునిచ్చారు.

బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటిక్యాల మండలంలోని వావిలాల, శాతర్ల, ఉదండాపూర్,పెద్దదిన్నె  గ్రామాల్లో చర్చిలను సందర్శించారు.ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మన రాజ్యం వస్తేనే మన బతుకులు మారుతాయని తెలిపారు.

ఇంకెంత కాలం కూలీలుగా, పేదలుగా బతుకుతామని ప్రశ్నించారు. పేదలు ప్రభుత్వ కాంట్రాక్టర్లు కావాలంటే, గుడిసెలల్లో పుట్టిన పిల్లలు విదేశాల్లో చదవాలంటే బహుజన రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేశవరావు, జిల్లా ఇంఛార్జి క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking