Take a fresh look at your lifestyle.

అధికారులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు

0 59

అటువంటి అధికారులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు

– జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

హైదరాబాద్ : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలన తీరుపై చేసిన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందించారు. ఈ మేరకు ట్విటర్ లో జస్టిస్ గోపాల గౌడ గారు ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోతోపాటు  పవన్ కల్యాణ్ గారు తన స్పందనను తెలియచేశారు. సంబంధిత కామెంట్స్ కి అనువాదమిది.

‘గౌరవనీయులైన జస్టిస్ గోపాల గౌడ గారు ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న వికృత పాలనపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని ప్రతి అధికారి తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిసున్న ప్రతి ప్రభుత్వ అధికారినీ ప్రజలు ఎంతో నిశితంగా గమనిస్తున్నారని మరచిపోవద్దు. అటువంటి అధికారులు ఒకటి తెలుసుకోవాలి. కార్యకారణ సంబంధాన్ని నిర్దేశించే సార్వజనీన న్యాయసూత్రం ‘కర్మ’. ఏది విత్తితే అదే పండుతుంది. కాబట్టి వైసీపీని గుడ్డిగా సమర్థిస్తున్న ప్రతి అధికారీ ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.’

 

Leave A Reply

Your email address will not be published.

Breaking