Take a fresh look at your lifestyle.

ఒరిస్సా రైలు ప్రమాద ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్

0 14

ఒరిస్సా రైలు ప్రమాద ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్

ఢిల్లీ, జూన్ 4 : ఒరిస్సా లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలైంది. ఈ ఘటన నేపథ్యంలో రైల్వేలో రిస్క్‌ అండ్‌ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి డైరెక్షన్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సదరు నివేదికను సుప్రీంకు అందజేసేలా చూడాలన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్‌ యివారీ పిటిషన్‌ దాఖలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking