Take a fresh look at your lifestyle.

సీఎం కేసిఆర్ విజన్ వల్లే దేశంలో నంబర్ వన్

0 13

సీఎం కేసిఆర్ విజన్ వల్లే అన్ని రంగాలలో మనమే నంబర్ వన్.

రాష్ట్రాభివృద్ధి చూసే బీ ఆర్ ఎస్ లోకి వలసలు

: చేవెళ్ల ఎంపీ డాక్టర్. రంజిత్ రెడ్డి

చేవెళ్ల,జూన్ 7: దేశంలో తెలంగాణ రాష్ట్రమే అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ఉందని, అది సీఎం కేసిఆర్ కు ఉన్న విజన్ వల్లే సాద్యమైందన్నారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి. బుధవారం చేవెళ్ల లోని వేంకటేశ్వర గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి, సాధించిన విజయాల పై వీడియో ను ప్రదర్శించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన కేసిఆర్ నాటి ఈ ప్రాంత ప్రజల కష్టాలను చూసి వాటిని రూపుమాపడానికి ఆయన అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రంజిత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల రీ డిజైన్ ల ద్వారా పల్లమెరిగిన నీటిని పైకి పారించిన గొప్ప విజన్ ఉన్న నాయకులు సీఎం కేసీఆర్ అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 19 లక్షల ఎకరాలు సాగు పెంచరాని గుర్తు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్ల రూపాయలతో చెరువులు పూడికలు తీసి, ఏడాదికి రెండు పంటలు పండేలా చేసిన ఘనత కెసిఆర్ దేనన్నారు. దేశంలో అన్ని రంగాలలో మన తెలంగాణ రాష్ట్రమే నెంబర్ 1 గా ఉందన్నారు. నాడు తల మీద గోదారి ఉన్న మన ప్రాంతం ఎడారిగా ఉండేదని కానీ స్వ రాష్ట్రంలో సాగునీటి సమస్యలన్నీ పరిష్కారమైయ్యాయని వివరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రం లో అన్ని పరిష్కారం అయ్యాయని తెలిపారు. మన రాష్ట్ర అభివృద్ది చూసి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు మన బీ ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని వివరించారు.

రాష్ట్ర అభివృద్ధి వెనుక నాయకుల విజన్ తో పాటు ఉద్యోగుల శ్రమ ఎంతో ఉందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకం, చెరువుల్లో చేప పిల్లల పంపిణీ లాంటి పథకాలతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఇటీవల సీఎం కేసిఆర్ మాట్లాడుతూ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా త్వరలో ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని పేర్కొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking