Take a fresh look at your lifestyle.

18 న ఉప్పల్ స్టేడియం లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్

0 388

హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్… ఔను.. మీరు విన్నది నిజమే.. జనవరి 18వ తేదిన ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.

ఇండియా వర్సెస్ న్యూజీల్యాండ్ ఒన్ డే మ్యాచ్ జరుగుతుందని HCA అధ్యక్షులు అజారుద్దిన్ మీడియాతో తెలిపారు.

నాలుగు సంవత్సరాల తరవాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగుతుందన్నారు ఆయన.

క్రికెట్ మ్యాచ్ కు టిక్కెట్స్ ఆన్ లైన్ లో పేటీయం ద్వారా మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలిపారు.

మ్యాచ్ కి రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరని అజారుద్దిన్ వివరించారు.

Lb స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాలన్నారు.

బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగ కుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు అజారుద్దిన్. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం అన్నారు.

ఆన్లైన్ టికెట్ లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా అమ్మకాలు.

జనవరి 13 6వేల టికెట్
జనవరి 14 7వేల టికెట్
జనవరి 15 7వేల టికెట్
జనవరి 16మిగతా టికెట్స్.

స్టేడియం కెపాసిటీ 39,112
కంప్లమెటరి టికెట్స్ 9695
29417 టికెట్స్ అమ్మకానికి.
ఆన్లైన్ టికెట్ తీసుకునేవారు కేవలం 4 టికెట్ లు మాత్రమే తీసుకోవాలి.

జనవరి 14 న హైద్రబద్ కి న్యూజిలాండ్ టీమ్ వస్తోంది.

15న న్యూజిలాండ్ సాయంత్రం ప్రాక్టీస్ చేస్తారు.

జనవరి 16 టీమ్ ఇండియా సిటీ కి చేరుకుంటోంది.

ఈ నెల 18 న మ్యాచ్ జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking