Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో నడి రోడ్డుపై ప్రజల సాక్షిగా హత్య..

0 16

ఢిల్లీలో నడి రోడ్డుపై హత్య..

యువతిని 20 సార్లు కత్తితో పొడిచిన ఆగంతకుడు

న్యూఢిల్లీ, మే 29 :
రోడ్డుపై ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే.. విడదీయడానికి కొంత మంది ప్రయత్నిస్తారు. అదే హత్యలు జరుగుతూంటే మాత్రం ఎవరూ జోక్యం చేసుకోరు. తమనూ ఏమైనా చేస్తారేమోననే భయంతో చాలా మంది దూరం వెళ్లిపోతారు. ఫలితంగా రోడ్డు మీద హత్యలు జరిగిపోతూ ఉంటాయి.

ఢిల్లీలోనూ ఇలాంటిదే జరిగింది. ఇక్కడ హత్యకు గురైన వారు.. హత్య చేసిన వారు ఇద్దరూ ఇరవై ఏళ్లలోపు వాళ్లే. ఆదివారం  ఢిల్లీలోని షహబాద్ ఏరియా ప్రాంతంలో..  16 ఏళ్ల అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంది.అదే సమయంలో అమ్మాయి  ని అడ్డుకున్నాడు  సాహిల్ అనే యువకుడు. వీళ్లిద్దరి మధ్య గతంలోనే పరిచయం ఉండటంతో.. వాగ్వాదం జరుగుతుంది. ఆ తర్వాత విచక్షణ కోల్పోయిన సాహిల్.. 16 ఏళ్ల సాక్షిని అత్యంత కిరాతకంగా చంపేశాడు.  ఆవేశంతో ఊగిపోయిన సాహిల్.. అమ్మాయి సాక్షిని నడిరోడ్డుపైనే.. కత్తితో 20 సార్లు పొడుస్తాడు. అప్పటికీ కసి తీరకపోవటంతో.. రోడ్డుపై ఉన్న బండ రాయి తీసుకుని అమ్మాయి ముఖంపై పలుమార్లు కొడతాడు.

తీవ్రగాయాలతో సాక్షి అక్కడికక్కడే చనిపోయింది. సాహిల్.. అమ్మాయి సాక్షిపై దాడి చేస్తున్న సమయంలో వీధిలోని వాళ్లందరూ సినిమా చూసినట్లు చూశారు.. ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.. ఇదంతా ఆ వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆదివారం   అమ్మాయి .. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చినట్లుగా పోలసులు చెబుతున్నారు. ఆమె అలా వస్తుందని తెలిసి సాహిల్ అడ్డగించాడు.

నిర్మానుష్యమైన ప్రాంతంలోనూ ఇలాంటి ఘటన జరిగితే.. ఎవరూ లేరని అనుకోవచ్చు.. నడిరోడ్డుపై.. రద్దీగా ఉండే వీధిలో ఓ అమ్మాయిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడుస్తున్నా.. రాయితో కొడుతున్నా ఒక్కరు అంటే ఒక్కరు కూడా అడ్డుకోకపోగా.. మనకు ఎందుకులే అంటూ చూస్తూ ఉండిపోయారు స్థానికులు.   మరికొందరు హత్యనుచూసి E ప్రాంతం నుంచి పరుగులు తీయటం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాలిక సాక్షిని చంపిన తర్వాత సాహిల్ అక్కడి నుంచి పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు పోలీసులు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking