Take a fresh look at your lifestyle.

అత్యంత ఘనంగా బోనాలు : మంత్రి తలసాని

0 15

అత్యంత ఘనంగా బోనాలు
: మంత్రి తలసాని

హైదరాబాద్, జూన్ 15 : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద వచ్చే నెల 9 వ తేదీన నిర్వహించే బోనాలు, 10 వ తేదీన నిర్వహించే రంగం, అంబారీ పై అమ్మవారి ఊరేగింపు నిర్వహణ, ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆషాడ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని, నాటి నుండి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, లక్షలాది గా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో బోనాల ఉత్సవాలకు అరకొర ఏర్పాట్లు చేసేవారని పేర్కొన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ప్రజలు సంతోషంగా, గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతోనే ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని, ఇందుకోసం ఈ సంవత్సరం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking