Take a fresh look at your lifestyle.

మరో నాలుగు రోజులు ఎండలే.. జాగ్రత్త..

0 14

ఈనెల 21 నాటికి రుతుపవనాల రాక
ఉత్తర, పశ్చిమ గాలుల వల్లే అధిక ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ డైరెక్టర్‌ స్టెల్లా

హైదరాబాద్ జూన్ 17 : మే నెల ముగిసింది. జూన్‌ మాసం సగమైంది. అయినా ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏటా జూన్‌ రెండో వారం నాటికి నైరుతి రుతుపవనాలు వాతావరణాన్ని చల్లబరిచేవి. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరో నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా స్పష్టం చేశారు. 21వ తేదీ నాటికి వాతావరణంలో మార్పులు వస్తాయని ఆమె వివరించారు. ఏటా రాజస్థాన్‌ నుంచి వేడిగాలులు బలంగా వీస్తాయి. వాటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లోనూ వడగాలులు వీస్తాయి. ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ దిశ నుంచి వేడిగాలులు తెలుగు రాష్ట్రాలవైపు వస్తున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు ఎక్కువగా పడుతోంది. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.ఈనెల 20వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేశాం.

Leave A Reply

Your email address will not be published.

Breaking