Take a fresh look at your lifestyle.

నమ్మలేని నిజం.. నాకు మొగుడు… ప్రియుడు ఇద్దరూ కావాలి

0 22

మొగుడు… ప్రియుడు నాకిద్దరూ కావాలి

  • ఓ కలియుగ ద్రౌపది

ఒక స్త్రీ.. ఐదుగురు మొగుళ్లు.. ఈ మాట ఎప్పుడో మహాభారతంలో విని ఉంటాం గదా.. ఇగో.. ఇప్పుడు ఓ మహిళకు పిల్లలు ఉన్నారు.. తాళి కట్టిన మొగుడు కూడా ఉన్నాడు. అయినా.. ఆ లేడి మరో మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అయితే.. ఇదో వార్తనా.. అంటూ అనుకోకండి.. ఆమె మరో మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి.

ఇకముందు పిల్లలతో మంచిగుండుమని సలహా ఇచ్చారు బంధువులు.. అయినా.. ఆమె ససేమిరా అంది.. నాకు ప్రియుడు కావాలి… మగాడు కావాలి అంటూ మొండి పట్టు పట్టింది కలియుగ ద్రౌపది. నా కోరిక నెరవేర్చక పోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె విద్యుత్ స్థంబం ఎక్కింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో బుధవారం జరిగింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన ముప్పై నాలుగేళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే, గత ఏడేళ్లుగా ఆ మహిళ పొరుగూరికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్తకు ఈ విషయం తెలియడంతో ఆమెను నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ప్రియుడు తమతోనే ఉంటాడని, అలాగైతే ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తొలుగుతాయని భర్తను కోరింది. ఇందుకు అతడు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది.

ఈ క్రమంలోనే గ్రామంలోని విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. గమనించిన స్థానికులు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ వాళ్లకు ఫోన్ చేయడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగా కిందకు దించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking