Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే రాజా సింగ్ క్లారిటీ.. బీజేపీ నుంచే పోటీ చేస్తా..

0 15

ఎమ్మెల్యే రాజా సింగ్ క్లారిటీ..

బీజేపీ నుంచే పోటీ చేస్తా..

హైదరాబాద్. ఏప్రిల్ 29 : పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ లోకి వెళ్తానన్న వార్తలో వాస్తవం లేదు. నాలాంటి వారిని ఎవరూ ఏ పార్టీ లోకి ఆహ్వానించరని అయన కుండ బద్దలు కొట్టారు. నా మెంటాలిటీ కి ఒక్క బీజేపీ మినహా ఏ పార్టీ సరిపోదు. బీజేపీ లో నాపై సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. బీజేపీ నేతలు నాతో మాట్లాడుతూనే ఉన్నారు… కేంద్ర మంత్రులు సైతం నాతో టచ్ లో ఉన్నారు. ధైర్యంగా ఉండమని చెబుతున్నారు. నేను బీజేపీ లోనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున గోషామహల్ నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking