Take a fresh look at your lifestyle.

టింబర్ డిపోలో చెలరేగిన మంటలు

0 164

రాజేంద్రనగరం లో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి, మార్చి 13 : హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టింబర్ డిపోలో చెలరేగిన మంటలు ఉధృతంగా మారి డిపో మొత్తం వ్యాపించినట్లు తెలుస్తోంది. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

షార్ట్ సక్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. సుమారు 8మంది సిబ్బంది నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking