Take a fresh look at your lifestyle.

లాకప్ డెత్ తో పారి పోయిన ఎస్ ఐ సతీష్ రెడ్డి

0 24

చింతపల్లి పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్

నిర్దేశం, నల్గొండ :

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి చింతపల్లి పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్ సంచలనం సృష్టించింది. సివిల్ కేసులలో జోక్యం చేసుకోవాద్దని ఒకవైపు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన కింది స్థాయి అధికారులు వినిపించుకోవడం లేరు. అక్రమంగా డబ్బులు సంపాదించడం ధ్యేయంగా సివిల్ కేసులలో జోక్యం చేసుకుంటున్నారు పోలీసు అధికారులు.

లాకప్ డెత్....

అన్నదమ్ముల భూముల పంచాయతీలో జోక్యం చేసుకున్న ఎస్ ఐ సతీష్ రెడ్డి  పాలెం తండాకు చెందిన సూర్య నాయక్ అనే వ్యక్తిని చావబాదడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్ కు మృతుడు ఇద్దరు అన్నదమ్ములు.

అయితే.. వీరిద్దరి మధ్య భూవివాదం ఉండటంతో సూర్య నారాయణను అరెస్టు చేసి ఎస్ ఐ చితుక బాదడంతోనే మరణించారని కుటుంభీకులు తెలిపారు. సూర్య నారాయణ మృత దేహనికి పోస్ట్ మార్టం చేయడానికి వైద్యులు ప్రయత్నించగా కుటుంభీకులు అడ్డుకున్నారు. అయితే.. ఎస్ ఐ సతీష్ రెడ్డి పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తారని భయంతో పారి పోయినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking