Take a fresh look at your lifestyle.

కేసీఆర్ నోరువిప్పాలి : వైఎస్ షర్మిల

0 12

కేసీఆర్ నోరువిప్పాలి : వైఎస్ షర్మిల

హైదరాబాద్, మే 16 : ప్రగతి భవన్ ప్రొడక్షన్, చిన్న దొర డైరెక్షన్ లో సాగిన టీఎస్పీఎస్సీ సిట్ దర్యాప్తు కథ కంచికి చేరినట్లే..! లీకుల సూత్రధారులు బయట నిర్దోషులుగా తిరుగుతుంటే.. పాత్రధారులు బెయిల్ పై బయటపడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. 30లక్షల మంది జీవితాలతో చలగాటమాడిన అతిపెద్ద కుంభకోణం చివరికి బోర్డును కూడా కదిలించలేకపాయె. ఐటీ శాఖ వైఫల్యం, కేటీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ స్కాం జరిగింది.

సిబిఐ రంగంలోకి దిగితే దొరుకుతామని భయపడ్డ దొరలు. సిట్ తో సైలెంట్ గా సెట్ చేశారు. దొంగలకే తాళాలు ఇచ్చినట్టు, మళ్ళీ పాత టీఎస్పీఎస్సీ తోనే పరీక్షలు పెడుతున్నారు. అదే బోర్డు, అదే లీకులు, అవే కంప్యూటర్లు.. మారింది పరీక్ష తేదీలు మాత్రమేనని ఆమె అన్నారు. కొత్త తేదీలతో పరీక్షలు పెట్టినంత మాత్రానా ఇంటి దొంగలు మళ్లీ పేపర్లు అమ్ముకోలేదని గ్యారెంటీ ఏంటి ? అపనమ్మకాన్ని మూటకట్టుకున్న టీఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఏంటి ? టీఎస్పీఎస్సీ స్కాం తర్వాత తీసుకున్న చర్యలేంటి ? ఇప్పటికైనా కేసీఆర్ నోరు విప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆమె అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking