Take a fresh look at your lifestyle.

కేసీఆర్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు : మల్లు భట్టి విక్రమార్క

0 15

కేసీఆర్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు

: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

నాగర్ కర్నూలు; మే 30 : కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సంపద, ఆదాయం కేసీఆర్ కుటుంబం, టి.ఆర్.యస్ నేతలు దోచుకుంటున్నారని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 500కోట్లు అప్పు చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సంజీవపురంకు సీఎల్పీ నేత చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది.

పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ స్ధానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లే వారిని ప్రజలు క్షమించరని కొన్ని లక్షల మంది ఓట్లను ప్రభుత్వం ఆశ చూపిన కోట్ల కోసం ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శలు చేశారు.

వచ్చే ఎన్నికలలో బి.ఆర్.యస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. పాదయాత్రలో అడుగడుగున ప్రజలు అనేక సమస్యలను తెలిపారు. దమ్ము ధైర్యం ఉంటే సీఎం కేసీఆర్, టి.ఆర్.యస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసులను అడ్డుపెట్టకోకుండా పరిపాలన చేయాలని సవాల్ విసిరారు. టి.ఆర్.యస్ ప్రభుత్వం ఆనాటి నిజం పరిపాలన కొనసాగిస్తున్నారని. టి.ఆర్.యస్ మంత్రులు వస్తే ప్రజలను, వివిధ పార్టీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను, వివిధ పార్టీలో నాయకులను అరెస్ట్ చేసే హక్కు ఎవరు ఇచ్చారని అయన ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పని చేయాలని, టి.ఆర్.యస్ నాయకులకు కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking