Take a fresh look at your lifestyle.

రైల్వే పాస్ ల కోసం జర్నలిస్టుల ధర్నా

0 287

జర్నలిస్టుల రైల్వే పాస్ లను పునరుద్ధరించాలి

హెచ్ యూజే , టిడబ్ల్యూజేఎఫ్ , టీబీజేఏ అద్వ్యర్యంలో రైల్ నిలయం ముందు ధర్నా చేశారు జర్నలిస్టులు. ఈ సందర్భంగా రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం అంద చేశారు.

జర్నలిస్టుల రైల్వే పాస్ లను వెంటనే పునరుద్ధరించాలని హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యుజె) , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ బ్రాడ్ క్యాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లు డిమాండ్ చేశాయి.

ఈ ఆందోళన కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య, హెచ్ యూజే అధ్యక్షులు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీష్, రాష్ట్ర కార్యదర్శి ఇ. చంద్ర శేఖర్, జర్నలిస్టు నాయకులు రఘు , గండ్ర నవీన్ , రాజశేఖర్ , సలీమా , నాగవాణి , మెరుగు చంద్ర మోహన్ , సుభాష్ , వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking