Take a fresh look at your lifestyle.

వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది : కేంద్ర మంత్రి

0 149

వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది

: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 27, బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను తెలుసుకోని మాట్లాడితే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వజమెత్తారు. SDRF ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర శాఖలను ఆదేశించిన తర్వాత, కూడా తెలంగాణ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంపై నిందలు వేస్తోందంటూ మండిపడ్డారు. SDRFకి భారత ప్రభుత్వ సహకారం 75%.. ఇది నిజం కాదని చెప్పగలరా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

ఒకవైపు, భారత ప్రభుత్వాన్ని నిందిస్తూనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి  రైతులకు నష్టపరిహారం అందించాలని కేసీఆర్ ప్రభుత్వం మెమో జారీ చేసిందంటూ గుర్తుచేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ నిధుల (ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌) కింద 2014 నుంచి కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి రూ.3,069.87 కోట్లు కేటాయించిందని, అయితే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఇంకా నిధులు అందలేదని చెబుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

అధునాతన సాంకేతిక యుగంలో, BRS ప్రభుత్వం కేంద్ర నిధులపై వాస్తవికతను కప్పిపుచ్చలేకపోయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద పంట నష్టపరిహారం అందజేస్తామని కె.చంద్రశేఖరరావు ప్రభుత్వం మెమో జారీ చేసిందని వివరించారు. ఇందులో కేంద్రం తన వాటాలో 75 శాతాన్ని మంజూరు చేసిందని, బీఆర్‌ఎస్ నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగా గుర్తించాలని ఆయన సూచించారు.రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను నిలిపివేశారని, అయితే పంటల బీమాకు ప్రత్యామ్నాయ పథకాన్ని ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో రైతులు పంట నష్టపరిహారం పొందలేకపోతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీఎంఎఫ్‌బీవైని అమలు చేసి ఉంటే రైతులకు పరిహారం సముచితంగా అందేదని కిషన్ రెడ్డి వివరించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking