Take a fresh look at your lifestyle.

ఆసుపత్రి నిర్మాణం కోసం దీక్ష

0 14

మనికేశ్వరీ నగర్ లో ఆసుపత్రి నిర్మాణం కోసం దీక్ష

మద్దతు ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 23 : మనికేశ్వరీ నగర్ లో ఆసుపత్రి నిర్మాణం కోసం దీక్ష చేస్తున్న బస్తీ వాసులకు సంఘీభావం మద్దతు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గతకొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ ఆసుపత్రి నిర్మాణం చేయాలంటూ బస్తీ వాసుల పోరాటం మాణికేశ్వర్ నగర్ లోని యూనివర్సిటీ స్థలంలో ప్రభుత్వం ఆసుపత్రి నిర్మించాలని స్థానికుల నిరసన దీక్ష చేస్తున్నారు. సామాన్యుల ప్రాథమిక అవసరాల పై రాజకీయలొద్దన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ప్రభుత్వం, యూనివర్సిటీ స్థలం ఇస్తే కేంద్రం నిధులతో ఎయిమ్స్ ఎక్సటర్నల్ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.ప్రజల డిమాండ్ లను లెక్కచేయకుండా ప్రభుత్వం, అధికారులు దౌర్జన్యం గా ప్రవర్తిస్తే ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరిక చేశారు.తెలంగాణ ఉద్యమంలో పోలీస్ బుల్లెట్ ల నుంచి విద్యార్థులను హక్కును చేర్చుకొని కడుపులో పెట్టుకొని ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ మాణికేశ్వర్ నగర్ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking