Take a fresh look at your lifestyle.

ఇండ్ల లొల్లి – కదం తొక్కిన మహిళలు

0 70

కరీంనగర్ ను తాకిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లొల్లి
కదం తొక్కిన మహిళలు

కరీంనగర్ : కరీంనగర్ లో మూడు సంవత్సరాల క్రితం కట్టిన 1600 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన పేదవాళ్లకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ తో 200 మంది మహిళలతో పట్టణం లో సోషల్ డెమోక్రాటిక్ ఫోరమ్ తరపున నిరసన ర్యాలీ నిర్వహించారు.

కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గంట సేపు బైటాయించారు. సి నినాదాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనికి రిటైర్డ్ ఐయేఎస్ అధికారి ఆకునూరి మురళి మద్దతుగా నిలిచారు.

మీకు ప్రగతి భవన్ – మాకు పూరి గుడిసె నా ? కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన పేదవాళ్లకు కేటాయించాలి’ అనే నినాదాలతో మహిళలు హోరెత్తించారు. ఆకునూరి మురళి తో పదిమంది మహిళలు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను కలిసి వారం రోజులలో కట్టిన 1600 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు కేటాయించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking