Take a fresh look at your lifestyle.

ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధినిలకు అస్వస్థత

0 191

ఇంటర్ పరీక్షలు రాస్తున్న

విద్యార్ధినిలకు అస్వస్థత

హైదరాబాద్, మార్చి 23 : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం నాడు ఇద్దరు విద్యార్దినిలకు పరీక్షాహాలు లో అస్వస్థతకు గురయ్యారు. ఏపీ ప్రకాశం జిల్లా మార్కాపురం లోని సాధన జూనియర్ కాలేజీ లో పరీక్ష రాస్తుండగా ఇంటర్ విద్యార్థినికి అస్వస్థత గురి కావడంతో బందోబస్తులో ఉన్న సీఐ బీమా నాయక్ ఆ విద్యార్థిని స్వయంగా తన వాహనంలో ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం
మరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షా కేంద్రంలోనే విద్యార్థిని బిందు గుండెపోటుకు గురయింది. దీంతో విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని బిందు ఆరోగ్యం నిలకడగా ఉందనిసమాచారం.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking