Take a fresh look at your lifestyle.

కొత్త సాక్ష్యాలతో హైకోర్టుకు.. కేసీఆర్ ఇక సర్దుకోండి..

0 16

కొత్త సాక్ష్యాలతో హైకోర్టుకు..

కేసీఆర్ ఇక సర్దుకోండి..

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ

హైదరాబాద్ , ఏప్రిల్ 27 : బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్28న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

30 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేసిన పేపర్ లీకేజీ కేసులో అసలైన నిందితులను పట్టుకోవడంలో సిట్ విఫలమైందని మరియు ప్రభుత్వం తమకు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సిట్ ఏమాత్రం విచారణ చేయకుండా అసలైన నిందితులను కంటికి రెప్పలా కాపాడుతుందని ఆయన ఆరోపించారు.

పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన 30 లక్షల మంది యువత గురించి మాట్లాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ, తప్పించుకుంటన్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే తెలంగాణ ప్రజలంతా కలిసి కేసీఆర్ ను జైలుకు పంపుతారని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పేపర్ లీకేజీ కేసును హైకోర్టు ప్రత్యేక జడ్జి చేత లేక సిబిఐకి అప్పగించాలని గత నెల రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

మరికొన్ని కొత్త సాక్ష్యాలతో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking