Take a fresh look at your lifestyle.

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి

0 63

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌

111 పోస్టుల‌కు జ‌న‌వ‌రి 8న రాత ప‌రీక్ష నిర్వ‌హించింది ఏపీపీఎస్సీ. ఈ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు 87,718 మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారు. ప్రిలిమ్స్‌లో 6,455 మంది అభ్య‌ర్థులు మెయిన్స్‌కు ఎంపిక‌య్యారు.

1:50 నిష్ప‌త్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేసిన‌ట్లు ఏపీపీఎస్సీ ప్ర‌క‌టించింది. ఫ‌లితాల కోసం psc.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లోని 297 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా నిర్వ‌హించారు. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు.

నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking