Take a fresh look at your lifestyle.

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

0 13

ఈతకు  వెళ్లి  నలుగురు చిన్నారులు మృతి

మృతులంతా ఒకే కుటుంభీకులు

గద్వాల, జూన్ 6 : జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడు విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. వీరంతా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన వారిని తెలిసింది. వివాహ శుభకార్య నిమిత్తం మానవపాడు మండలం బోరువెల్లి గ్రామానికి రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి మెలిసి గడిపారు.

కృష్ణా నదిలో స్నానం చేయాలని  సమీపంలోని పల్లెపాడు శివారులో ఉన్న కృష్ణానదికి వెళ్లారు. ఐదు గురు చిన్నారులు  వెళ్ళగా నలుగురు కృష్ణా నదిలో మునిగిపోయారు. ఓ చిన్నారి  మాత్రం ఒడ్డునకు చేరింది.మృతులంతా
ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు కావడంతో విషాదంలో అలముకుంది

Leave A Reply

Your email address will not be published.

Breaking