Take a fresh look at your lifestyle.

చేప ప్రసాదం పంపిణీ విజయవంతం : మంత్రి తలసాని

0 12

చేప ప్రసాదం పంపిణీ విజయవంతం
: మంత్రి తలసాని

హైదరాబాద్, జూన్ 10 : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి చేప ప్రసాదం పంపిణీ చేసిన బత్తిన హరినాద్ గౌడ్, వారి ఇతర కుటుంబ సభ్యులు, అక్కడకు వచ్చిన వారికి ఉచితంగా అల్పాహారం, భోజనం అందించిన స్వచ్చంద సంస్థలు, స్వచ్చందంగా సేవలు అందించిన వాలంటీర్ లతో పాటు GHMC, పోలీస్, ట్రాపిక్, ఎలెక్ట్రికల్, వాటర్ వర్క్స్, హెల్త్, శానిటేషన్, ఫైర్, మత్స్య, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులతో పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ సభ్యులు, ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking