Take a fresh look at your lifestyle.

ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి

0 13

ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి

జగిత్యాల, మే 20 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. భార్యాభర్తలు బైక్ మీద, వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లి గ్రామానికి చెందిన సూర భీమయ్య (34), ప్రేమలత (30) దంపతులు, వీరికి ముగ్గురు మగ పిల్లలు. రాజస్థాన్ కు చెందిన లారీ ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వారు లారీ క్రింద ఇరుక్కోవడంతో స్పాట్ లో భర్త భీమయ్య చనిపోయాడు, భార్య ప్రేమలత ను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో, పరిస్థితి విషమంగా ఉందని జగిత్యాల కు, అక్కడి నుండి కరీంనగర్ ఆసుపత్రి కి వెళ్ళేటపుడు మధ్యలోనే ఆమె మరణించింది. ఈ లారీ నిజామాబాద్ నుంచి జగిత్యాల్ వైపు వెళ్తున్నపుడు, కోరుట్ల బస్ స్టాండ్ ఔట్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమా అని తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని, డ్రైవర్ ని అదుపులో తీసుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking