Take a fresh look at your lifestyle.

పోలీసులు అదుపులో నకిలీ మావోయిస్టులు

0 11

పోలీసులు అదుపులో నకిలీ మావోయిస్టులు

చింతపల్లి. మే 3 : అల్లూరి జిల్లా జి మాడుగుల మండలంలో ముగ్గురు నకిలీ మావోయిస్టులు పోలీసులకు దొరికిపోయారు. వీరంతా జి మాడుగుల పరిధిలో ఐదుగురు వ్యక్తులు నకిలీ మావోయిస్టులుగా చాలా మనీ చేస్తూ కాంట్రాక్టర్లను గ్రామ పెద్దలను నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అదే క్రమంలో ఆలగం బ్రిడ్జి కాంట్రాక్టర్ కొంతమంది సర్పంచులు ద్వారా బెదిరింపులతో కాంట్రాక్టర్ 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. కాంట్రాక్ట్ సంబంధించిన మిషన్లను కాల్చివేసి కాంట్రాక్టర్ ను చంపేస్తామని బెదిరించారు. ప్రాణ భయంతో కాంట్రాక్టర్ ఈనెల 30న ఐదు లక్షలు రూపాయలు ఇవ్వటానికి, సర్పంచ్ లువా సింగ్ మధ్యవర్తిగా పంపించాడు.

నకిలీ మావోయిస్టులు దానికి తిరస్కరించి ఇస్తే 30 లక్షలు ఇవ్వాలి లేదంటే తను చంపేస్తామని బెదిరించారు. ప్రాణ భయంతో కాంట్రాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. మే ఒకటో తేదీ సాయంత్రం జి. మాడుగుల సిఐ, ఎస్ఐ అలగం బ్రిడ్జి వద్ద మాటువేసారు. అక్కడికి వచ్చిన నకిలీ మావోయిస్టుల్లో ముగ్గురు వ్యక్తులను పట్టుకున్ఆరు. మిగతా ఇద్దరు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయారు

నిందితులను నకిలీ మావోయిస్టులని పోలీసులు నిర్దారించారు. వారినుంచి 45000 నగదు, మూడు సింగిల్ బ్యారెల్ తుపాకీలు. మూడు మొబైల్ ఫోన్స్, మూడు ఆలివ్ గ్రీన్ దుస్తులు, ఒక తపంచా, ఒక ఎయిర్ పిస్టల్, మూడు వాకి టాకీలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking