Take a fresh look at your lifestyle.

రైతులకు, మిల్లు యాజమాన్యానికి మధ్య వివాదం

0 13

పంట తడవకున్నా తరుగు పేచీ
రైతులకు, మిల్లు యాజమాన్యానికి వివాదం

కోదాడ, మే 4 : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షం కారణంతో ఒకపక్క ఇబ్బందులు పడుతుంటే తరుగు పేరుతో రైతులను మరోపక్క మిల్లర్లు దోచుకుంటున్నారనిరైతులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తమ్మరబండ పాలెం గ్రామ శివారులో ఉన్న ఓ మిల్లుకు ఒక రైతు పండించిన పంటను తీసుకుని వచ్చారు. అక్కడ మిల్లు యాజమాన్యం తరుగు పేరుతో రెండు నుండి నాలుగు కేజీల తరుగు ఇవ్వాలనడంతో వివాదం మొదలయింది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి తీసుకువచ్చిన ధాన్యాన్ని ఏ విధంగా తరుగు తీస్తారు. నా ధాన్యం తడవలేదని, మంచిగా ఉన్న ధాన్యానికి ఏ విధంగా తరుగు తీస్తారని రైతు ప్రశ్నించారు. దాంతో మాజీ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మిల్లు యాజమాన్యం రైతులతో వాగ్వాదానికి దిగారు. అసలు మీ బండ్లు మొత్తం తీసుకుని వెళ్ళండి అని అహంకారపూరితంగా మాట్లాడారు. మీకు రూల్స్ తెలుసా కేసీఆర్ ఏ రూల్స్ పెట్టాడో తెలుసా అని రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని మిల్లుల పై చర్యలు తీసుకోవాలని బాధితు రైతు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking