Take a fresh look at your lifestyle.

ఈటల రాజేందర్ @ అసెంబ్లీ మీడియా పాయింట్

0 65

ఈటల రాజేందర్ @ అసెంబ్లీ మీడియా పాయింట్

తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా హ్యాపీగా లేరు..
ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? ఇప్పటి వరకు కూడ జీతాలు రాలేదు.
2.90 లక్షల బడ్జెట్ పెట్టినా 12 వతేదీ వరకు జీతాలు రాలేదు.

సభలో సంఖ్యా బలంతో గంటలసేపు అధికార పార్టీ వారు మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి మాయ చేయాలని చూశారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎన్నో మాటలు చెప్పారు. అయినా ప్రజలు నమ్మరు. రుణమాఫీ అయ్యిందా..రైతులకు తెలియదా?  తన వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి మోడీ మీద విమర్శలు చేశారు.  మళ్ళీ దేశానికి ప్రధాని మోడీ నే.  సగానికి పైగా సీఎం చెప్పిన లెక్కలు తప్పు.
140 కోట్ల ప్రజలు గౌరవించే వ్యక్తి మోడీ అని ఈటల రాజేందర్ అన్నారు. నేను పార్టీ మారలేదు, వాళ్లే నన్ను గెంటివేశారు.  గెంటివేసిన వాళ్ళు మళ్లీ పిలిచినా పోను అని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈటల చరిత్ర తెలిసిన వాళ్ళు నా గురించి తక్కువ ఆలోచన చేయలేదు.. ఈటెల పార్టీ మారుతున్నారు అని, ys హయాంలో కూడా ఇలాగే ప్రచారం చేశారు. ఇవాళ సీఎం నా పేరు ప్రస్తావన చెప్పగానే పొంగిపోను. నా మద చేసిన దాడి మరిచిపోను అని ఈటల రాజేందర్ అన్నారు. సంకుచితంగా వ్యవహారం చేయొద్దు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పినంత మాత్రాన నేను పొంగి పోను అని అన్నారు.

Trs లో కూడా సైనికుడిగా పని చేశా..బీజేపీ లో కూడా సైనికుడిగా పని చేస్తా అని ఈటల రాజేందర్ అన్నారు.నేను బీజేపీ లీడర్, జాతీయ ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యుడుని సభలో నా సొంత అజెండా ఉండదు. తెలంగాణ ప్రజల గొంతు వినిపిస్తా.

మెస్ చార్జీల మీటింగ్ కి పిలిస్తే తప్పకుండా వెళ్తా అని ఈటల రాజేందర్ అన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking