Take a fresh look at your lifestyle.

బిజెపికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : మంత్రి

0 157

బిజెపికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : మంత్రి

హైదరాబాద్, మార్చి 25 : రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం పై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ . కేంద్ర ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు ఆయన.

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే నన్నారు గౌడ్. మోడీ ప్రభుత్వం తన గోతిని తనే తొవ్వుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చీకటి రోజు. బిజెపి నియంతత్వానికి ఇది పరాకాష్ట. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే బిజెపి ప్రభుత్వ విధానం గా మారిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బిజెపి ప్రభుత్వం ఖూనీ చేస్తుంది. ప్రజలు బిజెపికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాహుల్ గాంధీ అనర్హత వేటు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను ఇప్పటికే దుర్వినియోగం చేయడమే కాకుండా దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక పార్లమెంటును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ఎంతో దుర్ధినం అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking