Take a fresh look at your lifestyle.

క్రికెట్‌ మాజా అనే యాప్‌ల ద్వారా బెట్టింగ్‌

0 81

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

సంగారెడ్డి, ఏప్రిల్ 4 (వైడ్ న్యూస్) ఆన్‌లైన్‌ ద్వారా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీఐ శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఐ సుభాష్‌ వెల్లడించారు.

అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని షిర్డీసాయి కాలనీలో నివాసం ఉంటున్న కుంచాలజగదీష్‌ (40) టీ-20 బెంగుళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌కు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న జగదీష్‌ ఇంటిపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

ఆ మ్యాచ్‌పై క్రికెట్‌ బెట్టింగ్‌, క్రికెట్‌ మాజా అనే యాప్‌ల ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. ఫోన్‌ ద్వారా పలు ప్రాంతాలలో సెంటర్లను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నాడు. బుకీల నుంచి సేకరించిన నగదు రూ.7,40,500, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking