Take a fresh look at your lifestyle.

పూర్వ విద్యార్థులతో మండలి చైర్మన్ గుత్తా

0 60

పూర్వ విద్యార్థులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

చిట్యాల : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తను చదివిన చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1969-70 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మిత్రులతో కలిసి సందడి చేశారు. పాఠశాల విద్యార్థిగా తనతోటి చదివిన మిత్రులతో కలిసి ఆనాటి విద్యార్థి దశ అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

తన స్వంత గ్రామం అయిన ఉరుమడ్లలో తన స్వగృహంలో తనతో చదివిన సహచరులకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ప్రోగ్రాం ఆయన ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారికి విద్యను నేర్పించిన గురువులను ఘనంగా సన్మానించారు.

అలాగే తమ బ్యాచ్ కు చెందిన ముగురు సోదరులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. శాసన మండలి చైర్మన్ హోదాలో బిజీగా ఉన్న, తమలో ఒకరిగా కలిసిపోయి పేరుపేరునా పరస్పరం అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి సహచరులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking