Take a fresh look at your lifestyle.

నిర్మల్ బస్టాండ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం

0 15

నిర్మల్ బస్టాండ్ కు కొత్త కల..

కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంకు ఓకే..

హైదరాబాద్, మే 27 : నిర్మల్ టిఎస్ ఆర్టిసి బస్టాండుకు కొత్త కల రానుంది. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంతో నయా లుక్. అత్యాధునిక హంగులతో, మెరుగైన వసతులతో టిఎస్ ఆర్టిసి నిర్మల్ బస్ స్టేషన్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నారు.  నిర్మల్ టిఎస్ ఆర్టిసి బస్ స్టేషన్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ఈరోజు – దేవదాయ శాఖ మంత్రివర్యులు  ఇంద్రకరణ్ రెడ్డితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్. నిర్మల్ టిఎస్ఆర్టిసి ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

నూతనంగా నిర్మించే టిఎస్ ఆర్టిసి కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్ మరియు జి – ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, 1, లక్ష ఎస్ఎఫ్టి తో నిర్మాణం చేయడం జరుగుతుంది. టిఎస్ ఆర్టిసి ద్వారా 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్ లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని – సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. హైదరాబాద్: ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో – గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారితో గౌరవ టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిర్మల్ బస్టాండులో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సహకారంతో టిఎస్ ఆర్టిసి చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని బస్టాండులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈరోజు మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారితో టిఎస్ ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ అధికారులతో నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ బస్టాండ్ గా నిర్మాణం చేసేందుకు, కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలను మంత్రి ఇంద్రగరణ్ రెడ్డి గారితో చర్చించారు. టిఎస్ ఆర్టిసి సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునికరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్కు టిఎస్ఆర్టిసి నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను నడపడం జరుగుతుంది.టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking