Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకటే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

0 15

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకటే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 22 : కాంగ్రెస్కు బీఆర్ఎస్కు తేడా లేదని, రెండు ఒకటేనని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్లోకి పోయారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందని స్పష్టం చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్.. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆయన అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైంది. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటున్నది..

భూములు, బిల్డింగ్లు కొనాలనుకుంటున్నరు. ఈ రోజు తెలంగాణ అవినీతిమయం అయింది. కల్వకుంట్ల కుటుంబంపాలైంది. మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నరు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే.. రాష్ట్రం కోసం అమరులైన 1200 వీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే.. బీర్ఎస్ కుటుంబ పార్టీని ప్రజలు ఓడించాలి. అవినీతి, నియంతృత్వ, అక్రమాలు చేసే పార్టీని, అధికారం దుర్వినియోగం చేసే పార్టీని ఓడించాలి.

కాంగ్రెస్కు ఓటేస్తమంటే.. కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు తేడా లేదు. గతంలో మనం చూశాం.. ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్లోకి పోయారు. అందుకే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుంది. బీఆర్ఎస్తో బీజేపీ ఇప్పటి వరకు పెట్టుకోలేదు.. భవిష్యత్లో పెట్టుకోదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నది.. ఢిల్లీలో టీఆర్ఎస్ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా చేశారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలంటే, నిజమైన బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే.. అది బీజేపీతోనే సాధ్యం. వందల, వేల కోట్ల రూపాయాలు అక్రమంగా సంపాదించి.. ఆ డబ్బును ఓటర్లకు పంచి ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడి అధికార పార్టీ, కేసీఆర్ ఉన్నారు.

డబ్బులతో ప్రజలను ఎక్కువసార్లు మభ్యపెట్టలేరు. గతంలో జరిగిన హుజూరాబాద్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అందుకు సాక్ష్యం. భారత ప్రధాన మంత్రి మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 9 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీ బూత్ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నాయి. ఈరోజు గోల్నాక డివిజన్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్నా 5 కేజీల ఉచిత బియ్యం వస్తున్నాయా? లేదా? అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా? ఆయుష్మాన్ భారత్ అమలవుతున్నదా? లేదా? తెలుసుకున్నాం. స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు నా హయాంలో కట్టించినవే.. బస్తీలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అంబర్పేట్ నియోజకవర్గంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి.

నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు. చిన్న చిన్న పార్టీలు ప్రజల ధానాన్ని దోపిడీ చేసే అవినీతి, కుటుంబ పాలన పార్టీలు అన్ని ఏకమైతే దేశానికి ప్రమాదం.. ఈ విషయం ప్రజలకు తెలుసు. వాళ్లు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరి అయితది. మోడీ నాయకత్వంలో దేశంలో సుస్థిరమైన, ప్రజలకు అభివృద్ధి చేసే, దేశ గౌరవం పెంచే ప్రభుత్వం ఉన్నదని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking