Take a fresh look at your lifestyle.

23న బిసి జర్నలిస్టుల సదస్సు.!

0 20

23న బిసి జర్నలిస్టుల సదస్సు.!

ముఖ్య అతిధిగా హాజరు కానున్న ఈటెల రాజేందర్.!

హైదరాబాద్ , ఏప్రిల్ 21 :  రాష్ట్ర రాజధానిలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 23న విశ్వేశ్వరయ్య భవన్ లో తలపెట్టిన బీసీ జర్నలిస్టుల సమ్మేళనానికి హుజురాబాద్ బీజీపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఆహ్వానించారు బీసీ సమాజ్ జర్నలిస్టు నాయకులు.

ఈ సమావేశానికి హాజరవుతా నని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందని, బీసీలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని బీసీ టైమ్స్ ఎడిటర్, బీసీ సమాజ్ అధ్యక్షులు సంగెం సూర్యారావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితుల్లో ఏమీ మార్పు రాలేదని, ఉద్యోగ భద్రత లేదని, మేనేజ్మెంట్ భరోసా లేదని, భవిష్యత్ పై ఆశలు కూడా లేకుండా పోయిందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking