Take a fresh look at your lifestyle.

ప్రజలలో పట్టు కోల్పొతున్న కమ్యూనిష్టులు

0 103

అసెంబ్లీ సీట్ల కోసం ఒక్కటైన కమ్యూనిస్టులు

బీఆర్ ఎస్ తో పొత్తు కోసం ఎర్తజెండా తహ తహ..?

హైదరాబాద్, ఏప్రిల్ 6, (వైడ్ న్యూస్) సీపీఐ, సీపీఎం మధ్య అవగాహన కుదిరిందా? భవిష్యత్‌లో ఆ రెండు పార్టీలు కలసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయా? రెండు ఎర్రజెండాలు కలిసి తెలంగాణలో గులాబీ జెండాకు జై కొడుతున్నాయా? కాషాయానికి వ్యతిరేకంగానే కామ్రెడ్లు ఈ నిర్ణయం తీసుకున్నారా? బీఆర్ఎస్‌తో పొత్తు, సీట్ల ఒడంబడికలే కీలకంగా మారనున్నాయా? ఏప్రిల్ 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండులో జరిగే సీపీఐ, సీపీఎం సంయుక్త బహిరంగ సభ ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది?తెలంగాణలో ఆ రెండు ఎర్రజెండాలు భుజంభుజం కలిపాయి! సిద్ధాంతాలు రాద్ధాంతాలు పక్కన పెట్టి, వామపక్షాల ఐక్యత అనే పాత నినాదానికి బూజు దులిపారు.

ఒక అవగాహనతో కలిసి పనిచేయాని సీపీఎం, సీపీఐ నిర్ణయించుకున్నాయి! బీజేపీకి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంలో గులాబీ జెండాకు ఇద్దరు కామ్రెడ్లు జై కొట్టారు. అ క్రమంలోనే మునుగోడులో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది సీపీఎం. అధికార BRSతో పొత్తు, సీట్ల పంపకాలే ఈ నిర్ణయంలో కీలకంగా మారబోతున్నాయి! ఏప్రిల్ 9న ఎగ్జిబిషన్ గ్రౌండులో జరగబోయే వామపక్షాల సంయుక్త బహిరంగసభ కేడర్‌కు ఒక సందేశం ఇవ్వబోతోంది! ఈ మేరకు ఇరు పార్టీలు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టాయి.తెలంగాణలో బీజేపీకి స్థానం లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. బీజేపీ దుస్సాహాసానికి పాల్పడుతోందని విమర్శించారు.

మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశం విఛ్ఛినమవుతుందన్నారు. తెలంగాణో బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అధికారపార్టీతో పొత్తు విషయంలో సీట్ల అంశమూ కీలకమే అన్నారాయన. రాహుల్ గాంధీపై అనర్హతవేటు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. సీబీఐని బాగా పొగిడిన మోదీ ..గతంలో ఇదే సీబీఐని కాంగ్రెస్ జేబు సంస్థ అని విమర్శించింది మర్చిపోయారని తమ్మినేని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా పోరాడుదామని షర్మి తనతో మాట్లాడారనీ.. కానీ బీజేపీ వైఫల్యాల గురించి షర్మిల  మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.  ఎప్రిల్ 9న ఎగ్జిబిషన్ గ్రౌండులో సీపీఐ, సీపీఎంల సంయుక్త బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సభకు రెండు పార్టీల జాతీయ నేతలు, రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి నేతలు హాజరవుతారని తమ్మినేని వెల్లడించారు.బీజేపీ తన ఎదుగుదల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. రాహుల్ గాంధీ ఎంపీ అనర్హత అంశం చర్చకు రాకుండా ప్రధాని తనస్థాయి మరిచి బీసీలను విమర్శిస్తున్నారని అన్నారు.

మోదీ తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాని చదువు గురించి అడిగితే రూ. 25 వేల జరిమానా విధించడం ఏంటని అన్నారు. మోదీలను ప్రశ్నిస్తే అనర్హత వేటు, రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తుంటే దేశం ఎటుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో కేసులో దోషులకు బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతల పై వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. మోదీది ఫాసిస్టు పరిపాలన అన్నారాయన. మోదీ విధానాలే ప్రతిపక్షాలను ఓక్కటి చేస్తున్నాయని కూనంనేని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking