తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారికి టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు.
ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. శాంతికుమారి చిత్తశుద్ధి తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని మెగాస్టార్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
తెలంగాణకు తొలి మహిళా సీఎస్గా శాంతికుమారి నియామకం కావడం సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు.