Take a fresh look at your lifestyle.

నిరుద్యోగుల గోస అఖిలపక్ష భరోసా

0 19

ఛలో ఇందిరాపార్క్

నిరుద్యోగుల గోస అఖిలపక్ష భరోసా

నిరసన దీక్ష ను జయప్రదం చేయాలని అఖిలపక్షం పోరాటం చేస్తోంది. ఏప్రిల్ 18న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగే ఆందోళనలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని బిఎస్ పి, కాంగ్రెస్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, జన సమితి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్నహాలు చేసారు.

రాష్ట్రంలో పేపర్ లీక్ లతో నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం  చెలగాటం ఆడుతుందని తెలంగాణ కోసం పోరాటాలు చేసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వంకు బుద్ది చెప్పాలని అఖిలపక్షం నిర్ణయించింది.

ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న టీఎస్పీఎస్సి పేపర్ లీక్ ల విషయంలో సిట్టింగ్ జడ్జ్ తో కానీ, సిబిఐ తో కానీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు ఇచ్చింది.

ఇప్పటికే విద్యార్థులు స్టడీ చేస్తున్న ప్రాంతాలకు స్వయంగా వెళ్లిన నాయకులు నిరుద్యోగులతో మాట్లాడారు. చలో ఇందిరా పార్క్ అనే నినాదంతో తరలి రావడానికి సిద్దమవతున్నారు నిరుద్యోగులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking