Take a fresh look at your lifestyle.

ఆర్టిజన్ల సమ్మెకు బిఎస్పి సంపూర్ణ మద్దతు

0 15

ఆర్టిజన్ల సమ్మెకు బిఎస్పి సంపూర్ణ మద్దతు

: డాక్టర్ ఆర్ ఎస్. ప్రవీణ్ కుమార్

హైదరాబాద్,ఏప్రిల్ 24 : తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబ్ నగర్ జిల్లా నుండి కలెక్టర్ గా పన్ చేసిన క్రిష్ణయ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ ను 1994లో ఆనంద్ మోహన్ అనే వ్యక్తి హత్య చేయగా అప్పటి ప్రభుత్వం అతన్ని జైలుకు పంపింది.

అయితే ప్రస్తుత నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ దోషిని జైలు నుండి విడుదల చేయడాన్ని బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయవతి ఖండించారు. అణగారిన దళిత వర్గాలకు చెందిన అధికారిని హత్య చేసిన దోషి వైపు ప్రభుత్వం నిలబడడాన్ని విమర్శించింది. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేక ప్రభుత్వంగా పేర్కొంది.

ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  మాట్లాడుతూ జి.కృష్ణయ్య అనే ఐఏఎస్ అధికారి హత్య గురించి స్పందించిన మాయవతికి ధన్యవాదాలు తెలిపారు ఆయన. ఆనంద్ మోహన్ అనే నేరస్థుణ్ని జీవితకాలం జైలులోనే ఉంచాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఈ నెల 25 నుండి సమ్మె చేయాలని నిర్ణయించిన ఆర్టిజన్లకు బిఎస్పి
పార్టీ మద్దతు ప్రకటించింది. 1948 కాలం నాటి చట్టాల ప్రకారం ఎలా ఉద్యోగులకు జీతాలిస్తారని ప్రశ్నించారు. 23 వేల మంది కార్మికులు రాత్రింభవళ్లు పని చేస్తేనే మీ విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. కానీ వారికి కనీస వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

వారి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని అడిగితే, వారినే భర్తరఫ్ చేస్తామని బెదిరించడం ఏంటని మండిపడ్డారు. వారు చేపట్టబోయే సమ్మెకు బిఎస్పి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు.ప్రశ్నించారు. 23 వేల మంది కార్మికులు రాత్రింభవళ్లు పని చేస్తేనే మీ విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. కానీ వారికి కనీస వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని అడిగితే, వారినే భర్తరఫ్ చేస్తామని బెదిరించడం ఏంటని మండిపడ్డారు. వారు చేపట్టబోయే సమ్మెకు బిఎస్పి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking