Take a fresh look at your lifestyle.

విద్యార్థుల సమస్యలపై బీజేవైఎం అందోళన

0 16

విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బీజేవైఎం అందోళన

హైదరాబాద్, జూన్ 8 : విద్యారంగ సమస్యలపై లకిడికాపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు  భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. రాష్ట్రంలోని ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు… వెంటనే ఫీజు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాలని అందోళనకారులు  డిమాండ్ చేసారు.  ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం కాకుండా పాఠశాలలో మెరుగైన మౌలిక, ఆధునిక వసతులు కల్పిస్తూ… విద్యా శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలి.  ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలను నిషేధించాలని నినాదాలు చేసారు. నిరసనకారులు   కార్యాలయ గేటు లోపలికి వెళ్లేందుకు యత్నించడం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking