Take a fresh look at your lifestyle.

తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై మండి పడ్డ బీజేపీ

0 289

తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై మండి పడ్డ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

హైదరాబాద్, మార్చి 22 : తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ లను అరెస్ట్ చేసిన పోలీసుల తీరును  తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. మంగళవారం వందలాది మంది పోలీసులు క్యూ న్యూస్ ఆఫీస్ కు వచ్చి తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ లను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అయితే… ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ తీన్మార్ మల్లన్న ఇంటికి వచ్చి కుటుంభీకులకు ధైర్యం చెప్పారు.

తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ లను వెంటనే విడుదల చేయాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు బండి సంజయ్. పోన్ లో పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఆ ఇద్దరిని వెంటనే విడుదల చేయనట్లయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు బండి సంజయ్.

ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనుకుంటారా? అంటూ సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. పోలీసులు దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా? అంటూ ప్రశ్నించారు ఆయన. ఖబడ్దార కేసీఆర్…. బేషరతుగా విడుదల చేయాల్సిందే నని హెచ్చరించారు. విఠల్ ఆరోగ్యం బాగోలేదు… ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత వహించాల్సిందే, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు బండి సంజయ్.

కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతి ఇదేనా? అంటూ ప్రశ్నించారు బండి సంజయ్.  కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారరు ఆయన. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులారా… బయటకు రండి అంటూ పిలుపు నిచ్చారు బండి సంజయ్.

Leave A Reply

Your email address will not be published.

Breaking