Take a fresh look at your lifestyle.

అబద్దాల పునాది మీద బిజెపి రాజకీయం చేస్తుంది

0 105

మోడీ ఓ అబద్ధాలకోరు

అబద్దాల పునాది మీద బిజెపి రాజకీయ చేస్తుంది

– హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ గారు

హైదరాబాద్, ఏప్రిల్ 02 : BRS పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా ఈరోజు హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గం ఆడికమేట్ డివిజన్ లో ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ముఠా గోపాల్‌ నాయకత్వం లో డివిజన్ అధ్యక్షులు బాల్లా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తలసాని సాయి కిరణ్ యాదవ్, ముఠా జై సింహ, కట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం లో హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ గారు మాట్లాడుతూ..
మోడీ ఓ అబద్ధాలకోరు.. అబద్దాల పునాది మీద బిజెపి రాజకీయ చేస్తుందని మండిపడ్డారు.

ఎవరైనా నువ్వు ఏం చదివావు.. నీ సర్టిఫికెట్ ఏది అంటే ఎవరైన వారి చదివిన చదువుకు తగ్గ సర్టిఫికెట్ ను చూపిస్తారు. కానీ ప్రధాని మోడీ మాత్రం నువ్వు ఏం చదివవు.. నీ సర్టిఫికెట్ చూపించు అంటే మాత్రం చూపించడు. పైగా అడిగిన వాళ్లపై కేసులు పెడతారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఇంత చదువు రాని మనిషి ప్రధాని గా ఉండాలే.. ముర్కత్వం తో ఈరోజు మన దగ్గరి నుండి గ్యాస్ రూపంలో , పెట్రోల్ డీసెల్ రూపంలో దోచుకొని అదానీకి కట్టపెడుతున్నాడు. అటువంటి వ్యక్తి కి ఓటు వేద్దామా..రాముడి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి ..శాంతియుతంగా ఉన్న తెలంగాణను విచ్ఛిన్నం చేయాలనీ ప్రయత్నం చేస్తున్నాడు.

కాబట్టి మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు కేసీఆర్ గారు భారతదేశం గర్వించే స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి తెలంగాణను దొంగలకు సద్దులు మోస్తున్న బీజేపీ కి విడిచిపెడతామా..? తెలంగాణ కాపాడుకోవాల్సిన భాద్యత మనపైన ఉందన్నారు .దాసోజు శ్రవణ్‌

 

Leave A Reply

Your email address will not be published.

Breaking