Take a fresh look at your lifestyle.

దేశద్రోహీ నిజా వారసునికి అధికారికంగా అంత్యక్రియలా..?

0 206

నిజాం వారసునికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి – VHP

మహిళలను బట్టలూడదీసి బతుకమ్మ ఆడించిన చరిత్ర నిజాంది..!

నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో విలీనం చేసేందుకు ప్రయత్నం చేసిన నిజాం దేశద్రోహ చర్య మరిచారా.?

తెలంగాణ ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగల్పడం తగదు..

ఆఖరి నిజాం మనుమడు ముకర్రమ్ రుూ అంత్యక్రియలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదు. అలా చేస్తే తెలంగాణా పోరాటాల చరిత్రను,నిజాం వ్యతిరేఖ పోరాటంలో నాటి ప్రజలు చేసిన త్యాగాలను అవమానించడమేనని విశ్వహిందూ పరిషత్ (VHP)ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

నిజాం వారసత్వాన్ని అధికారికంగా గుర్తించడం తెలంగాణా ప్రజలను అవమానించడమేనని మండిపడుతోంది. ఈ మేరకు సోమవారం రాత్రి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ప్రకటన విడుదల చేశారు.

నాటి హైదరాబాద్ సంస్థానంలోని హిందువుల మాన ప్రాణాలపై నిజాం రజాకార్లు సాగించిన మారణహోమాన్ని ఎన్ని తరాలు మారినా ఇక్కడి ప్రజలు మర్చిపోరని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మహిళలను బట్టలు విప్పి బతుకమ్మ ఆడించిన చరిత్ర నిజాం రాజుది అని విమర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి KCR గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking