Take a fresh look at your lifestyle.

అంబెద్కర్ ఆశయం కోసం పని చేయాలి : బిఎస్ పి

0 63

సీఎం స్వంత ప్రచారం కోసం రెండు కోట్లు ఖర్చు చేశారు

బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

గద్వాల జిల్లా, ఏప్రిల్ 14 :  అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం ఉదండాపూర్ గ్రామంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అంబెద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఆయన.

దేశానికి స్వాతంత్ర్యం సాధించి ఇన్నేళ్లు గడిచినా పేదలు ఇంకా పేదలుగానే ఎందుకుంటున్నారని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. పేదలు ఇంకా కూలీ చేస్తూనే  బతకాలా అంటూ ప్రశ్నించారు ఆయన. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అంబేడ్కర్ విగ్రహాలు పెట్టుకోండి అంటున్నారు పాలకులు. అంబేడ్కర్ పేదల చదువు కోసం కృషి చేయాలన్నారు. సంపద అంతా ఒక్కరి దగ్గర ఉండకూడదన్నారు అంబేడ్కర్. విగ్రహాలు పెట్టడం మాత్రమే కాదు. ఆయన చెప్పిన మాటలు అమలు చేయాలన్నారు ఆయన.

అంబేడ్కర్ అందరిని సమానంగా చూడాలన్నారు. కానీ ముఖ్యమంత్రి కనీసం తన ఇంటికి కూడా రానివ్వడం లేదన్నారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఉద్యోగులకు జీతాలు లేవు, మిషన్ భగీరథ ఉద్యోగులకు జీతాలు లేవు, గ్రామ సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వడం లేదు, కానీ పత్రికా ప్రకటనలకు రెండు కోట్లు  ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోట్లు ఖర్చు చేసి, యాడ్ ఇచ్చారు కానీ బిఎస్పి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్నారు ప్రవీణ్ కుమార్. గ్రూప్ 1 పేపర్ లీకేజీ గురించి మాట్లాడాలని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో టాపర్ ఎవరో, వారికి ఎన్ని మార్కులొచ్చాయో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking