Take a fresh look at your lifestyle.

శ్రీవారి అర్చన సేవలో ఆదిపురుష్ మూవీ టీం

0 13

శ్రీవారి అర్చన సేవలో ఆదిపురుష్ మూవీ టీం

తిరుమల, జూన్ 7 : తిరుమల శ్రీవారిని ఆదిపురుష్ మూవీ టీం దర్శించుకుంది.. బుధవారం వేకువజామున శ్రీనివాసుడి అర్చన సేవలో ఆదిపురుష్ చిత్ర హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్, సంగీత దర్శకుడు అజయ్ ఆతుల్ కలిసి శ్రీనివాసుడి సేవలో పాల్గోని ఆశీస్సులు పొందారు.. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఆదిపురుష్ చిత్రం దర్శకుడు ఓం రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగిందన్నారు.. స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా మంత్ర ముగ్ధుడునయ్యానని దర్శకుడు ఓం రౌత్ తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking