Take a fresh look at your lifestyle.

మంత్రి మల్లారెడ్డి ఇదేమి పనయ్యా..? ఓటు కోసం గీ యేషాలా..?

0 60

ఓటు కోసం మహిళను

ఒళ్లో కూర్చోపెట్టుకున్న మంత్రి

మంత్రి మల్లారెడ్డి.. ఎప్పుడూ వింత పనులు చేస్తూ ప్రజల్లో నానుతాడు. పాలు అమ్మినా.. పూలు అమ్మినా అంటూ స్పీచ్ లు ఇస్తూ అందరిని నవ్విస్తాడు. నలుగురితో కలిసి తీన్మార్ స్టెప్ లు వేస్తాడు.

ఇగో.. ఈ అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి మల్లారెడ్డి వింత చేష్టాలను ఊహించడం సాధ్యం కాదెమో..? శుక్రవారం మేడ్చల్ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలను కలిసి ఓటు వేయాలని కోరారు.

మరో అడుగు ముందుకేసి ఆ మహిళల మధ్య కూర్చుండి ఓ వృద్ద మహిళను తన ఒళ్లో కూర్చోపెట్టుకుని పూల బోకేను ఇచ్చిండు మంత్రి. ‘‘ కారు గుర్తుకే మన ఓటు.. మల్లారెడ్డి జిందాబాద్..’’ అంటూ ఆ మహిళలతో నినాదాలు చేయించాడు అతను. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యేలోపు మంత్రి మల్లారెడ్డి ఇంకేన్ని వేషాలు వేస్తారో ఎదురు చూడాల్సిందే..

Leave A Reply

Your email address will not be published.

Breaking