Take a fresh look at your lifestyle.

కదులుతున్న రైలెక్కుతూ జారిపడ్డ మహిళ

0 70

ముంబై: ఈ మధ్య రైల్వేస్టేషన్‌లలో కదులుతున్న రైళ్లు ఎక్కబోతూ ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి.

రైల్వేస్టేషన్‌కు ఆలస్యంగా చేరుకుని, రైలు వెళ్లిపోతున్నదన్న కంగారులో కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు.

మరికొందరు కాళ్లు, చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మారారు. ఇంకొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్‌ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపోయింది. అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, మరికొందరు ప్రయాణికులు వెంటనే స్పందించి ఆ మహిళను ప్లాట్‌ఫామ్‌పైకి లాగేయడంతో ప్రాణాపాయం తప్పింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking