Take a fresh look at your lifestyle.

లేడి జర్నలిస్ట్ లకు వుమెన్స్ డే గిఫ్ట్..

0 96

విజయవంతంగా కొనసాగుతున్న

మహిళా జర్నలిస్టుల ఆరోగ్య శిబిరం

హైదరాబాద్, ఏప్రిల్ 1 (వైడ్ న్యూస్) సమాచార పౌర సంబంధాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో మహిళా జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరంలో శనివారం ఎక్కువ సంఖ్యలో మహిళా జర్నలిస్టులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మహిళా జర్నలిస్టుల కు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు ప్రారంభించింది.

రాష్ట్ర ఐటి , మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా జర్నిలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెక్అప్ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.

ఏప్రిల్ 9 వ తేదీ వరకు (ఏప్రిల్ 2 వ తేదీ ఆదివారం మినహా ) నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెక్ అప్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లో రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వైద్య అధికారులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఈ విధానం పట్ల పరీక్షలు చేయించుకున్న మహిళా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking