Take a fresh look at your lifestyle.

స్కూల్ కు వెళ్లిన విద్యార్థి మిస్సింగ్

0 55

ఆందోళనలో కుటుంభీకులు

హైదరాబాద్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్ పల్లి విలేజ్ లో  రావి శ్వేత – అశోక్ రెడ్డి దంపతులు నివాసం  ఉంటున్నారు.

పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పక్కనే గల  సెయింట్ అంతోని స్కూల్  లో రావి శ్వేత – అశోక్ రెడ్డిల  కుమారుడు అశోక్ రెడ్డి(14) 10వ తరగతి చదువుతున్నాడు.

అశోక్ రెడ్డి స్కూల్  కి వెళ్తున్నానని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.

అతని  చెల్లి అనన్య  ఇంటికి వచ్చి తల్లి తండ్రులకు అన్నయ స్కూల్ కి రాలేదని చెప్పడంతో తెలిసిన చోటల్లా వెతికి, దుండిగల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న  పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking