Take a fresh look at your lifestyle.

అమరులను స్మరించుకున్న అమరుల బంధుమిత్రుల సంఘం

అమరవీరుల ఆశయం సాదిద్దాం.. అమర వీరులకు విప్లవ జోహార్లు.. ఆదివాసులపై పోలీసుల దాడులు అరికట్టాలి.. బూటకపు ఎన్ కౌంటర్ లను ఖండించాలి.. ఇగో.. ఇలా నినాదాలు చేశారు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు.

0 613

అమరులను స్మరించుకున్నారు..

అమరవీరుల ఆశయం సాదిద్దాం.. అమర వీరులకు విప్లవ జోహార్లు.. ఆదివాసులపై పోలీసుల దాడులు అరికట్టాలి.. బూటకపు ఎన్ కౌంటర్ లను ఖండించాలి.. ఇగో.. ఇలా నినాదాలు చేశారు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు.

సికింద్రాబాద్ లోని సుభాష్ నగర్ లో అమరవీరుల స్థూపం వద్ద ఎర్రజెండాను ఆవిష్కరించిన అనంతరం సంస్మరణ సభ నిర్వహించారు.

             ‘‘అమరులను స్మరించుకుందాం.. కగార్ యుద్ధాన్ని ఎదిరిద్దాం..’’ అంటూ అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పేద ప్రజల కోసం పోరాటాలు చేస్తున్న నక్సలైట్లను దండకారణ్యంలో ఏడాదిలోనే 130 మందిని పొట్టన పెట్టుకున్నారని అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జననాట్య మండలి ఆధ్వర్యంలో కళకారులు అమరుల త్యాగాలను స్మరిస్తూ పాటలు పాడారు. మీ త్యాగాలు వృధా కావంటూ పిడికిలి బిగించి నినాదాలు చేశారు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు.

– యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking