Take a fresh look at your lifestyle.

 కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న ఎమ్మెల్సీ..

0 45

 కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల,మార్చి 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ,నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున కొండపైకి చేరుకున్న కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా స్వామివారికి ,అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధానార్చకులు చిరంజీవి, ఎస్సై చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఈడీ విచారణ నేపథ్యంలో కవిత కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం పట్ల ప్రజాప్రతినిధులు, ప్రజలు అంజన్న రక్ష కోరుతూ దర్శనానికి వచ్చినట్లు పలువురు చర్చించుకున్నారు.

ఇదిలా ఉండగా, ఆలయ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే, పార్టీ నాయకులు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఒక్కరే దర్శనం చేసుకోవడం గమనార్హం, కవిత సమాచారం ఇవ్వకపోవడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking